అధికారులు, ప్రజాప్రతినిధులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలిః మంత్రి హరీశ్‌

minister-harish-rao

మెదక్‌ః వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై మెదక్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎలాంటి ప్రాణ,ఆస్థి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి.

స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ అధికారులు ప్రజలకు సేవలు అందించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/