అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూ.ఎన్టీఆర్

ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానుల ఫై జూ.ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలుగు ప్రజలందరి చేత అన్నగారు అనిపిలిపించుకున్న మహానేత, యుగపురుషుడు నందమూరి తారకరామారావు జయంతి ఈరోజు. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉదయం నుండి నందమూరి కుటుంబ సభ్యులు , టీడీపీ శ్రేణులు , అభిమానులు పెద్ద సంఖ్యలో నివాళ్లు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం ఎన్టీఆర్‌ ఘాట్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చారు.

ఈ క్రమంలో ఘాట్ వద్ద అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎన్టీఆర్ తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దీంతో నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్‌ ఇబ్బందులు పడ్డారు. ఫ్యాన్స్‌ చేసే అత్యుత్సాహం పై జూనియర్ ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు.