నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా పడిపోయిన చికెన్ ధరలు

కార్తీకమాసం ఎఫెక్ట్ చికెన్ ధరలపై భారీగా పడింది. మొన్నటి వరకు కేజీ రూ.300 ఉన్న చికెన్ ధర ఏకంగా సగానికి పడిపోయింది. కార్తీకమాసంలో చాలామంది నాన్ వెజ్ జోలికి వెళ్లారు. ఇంట్లో ఎంతో భక్తిశ్రద్దలతో పూజలు చేస్తూ..కనీసం ఎగ్ కూడా తినకుండా ఉంటారు. దీంతో మార్కెట్ లో నాన్ వెజ్ కు డిమాండ్ లేకుండా పోతుంది. ఈ క్రమంలో నాన్ వెజ్ ధరలు తగ్గడం జరుగుతుంది.

మొన్నటివరకు ఎలెక్షన్స్ కావడంతో ధరలు ఊపంధుకున్నాయి.. అయితే ఇప్పుడు కార్తీక మాసంతో ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గాయి. దీంతో ప్రస్తుతం కిలో చికెన్‌ విత్‌ స్కిన్‌ రూ. 150, స్కిన్‌లెస్‌ రూ. 170కి పడిపోయింది. గడిచిన నాలుగు నెలల్లో కిలో చికెన్‌ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం. కోళ్లు ఒక పరిమాణానికి వచ్చిన తర్వాత కచ్చితంగా వాటిని అమ్మేయాల్సిందే. లేదంటే వాటికి మేత ఎక్కువవడంతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీంతో మార్కెట్లో డిమాండ్‌ తగ్గి, భారీగా కోళ్లు రావడంతో ఆటోమేటిగ్‌గా ధర తగ్గుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.. ఒకవైపు చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ధరలు పూర్తిగా తగ్గాయి.. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్‌ ధరలు ఏకంగా 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. కార్తీక మాసం ముగిసే సమయానికి చికెన్ ధరలు ఇలాగే ఉండే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.