నిర్భయ కేసు: వినయ్ శర్మకు ఏ సమస్య లేదు
డాక్టర్లు ప్రతి రోజూ పరీక్షలు చేస్తున్నారు: తీహార్ జైలు అధికారులు
న్యూఢిల్లీ: నిర్భయ నిందితులు పూటకో రాద్ధాంతం చేస్తూ ఉరిని వాయిదా వేసేందుకు యత్నిస్తున్నారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అయితే..నిర్భయ కేసులో ఉరి శిక్ష అమలు కావాల్సిన వినయ్ శర్మ, ఆరోగ్య పరంగా బాగానే ఉన్నాడని, అతన్ని ఏ క్షణమైనా ఉరి తీయవచ్చని తీహార్ జైలు అధికారులు వ్యాఖ్యానించారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకే అతను తలను గోడకేసి బాదుకున్నాడని, మానసిక వ్యాధితో బాధపడుతూ ఉన్నట్టు నటిస్తున్నాడని వెల్లడించారు. ఇదే విషయాన్ని తాము పటియాలా కోర్టు న్యాయమూర్తి ధర్మేందర్ కు వెల్లడించామన్నారు. ఎలాంటి మానసిక రుగ్మతలతో బాధపడట్లేదని, జైలు డాక్టర్లు తరచూ పరీక్షలు చేస్తూనే ఉన్నారని అన్నారు. కాగా, నిర్భయ కేసులో మార్చి 3న నలుగురు నిందితులకూ శిక్షను అమలు చేయాలని డెత్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/