19 వ రోజు ప్రారంభమైన లోకేష్ యాత్ర

నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర నేడు 19 వ రోజుకు చేరుకుంది. ఈరోజు తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో లోకేష్ యాత్ర కొనసాగనుంది. ఉదయం 8.30 గంటలకు నారాయణవనం మండలం విత్తన తడుకు నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు లోకేష్. 9.35 గంటలకు స్థానికులతో సమావేశం అయ్యారు.

10.30 గంటలకు అరణ్యకండ్రిగ లో దాసరి పద్మశాలి సామాజిక వర్గంతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం కృష్ణంరాజుల కండ్రిగ, తుంబూర ప్రాంతాల్లో పాదయాత్రను చేయనున్నారు. మధ్యాహ్నం 3.00 గంటలకు ఐ ఆర్ కండ్రిగ వద్ద లంచ్ బ్రేక్ అనంతరం తీసుని.. మధ్యాహ్నం 3.05 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. సాయంత్రం స్థానికులతో సమావేశం కానున్నారు. ఇక లోకేష్ చేపట్టిన పాదయాత్ర 400 రోజులు , 4వేల కిలో మీటర్లు సాగనుంది. నిన్నటి వరకు 231.3 కిలోమీటర్ల మేర లోకేష్ యాత్రను సాగించారు. లోకేష్ యాత్ర కు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ యాత్ర ను ముందుకు తీసుకెళ్తున్నారు లోకేష్.