దేశంలో కొత్తగా 7,350 కరోనా కేసులు
మొత్తం మరణాల సంఖ్య 4,75,636
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 7,350 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న 202 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి నిన్న 7,973 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 561 రోజుల కనిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 91,456 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
ఇప్పటి వరకు మొత్తం 3,41,30,768 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 4,75,636 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న దేశంలో 19,10,917 కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. ఇప్పటివరకు మొత్తం 133,17,84,462 డోసులు వాడారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/