అమిత్ షా తో భేటీలో మాట్లాడింది ఇదే – నారా లోకేష్
బుధువారం సాయంత్రం ఢిల్లీ లో కేంద్ర మంత్రి అమిత్ షా తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి లు భేటీ ఐన సంగతి తెలిసిందే. ఈ భేటీ లో టీడీపీ – జనసేన – బిజెపి పొత్తుల ఫై చర్చలు జరిపారని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండడం తో..ఈ వార్తలపై నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.
అమిత్ షా తో భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలను ప్రస్తావించలేదని నారా లోకేష్ వివరణ ఇచ్చారు. ఈ భేటీలో కేవలం కేసులపై మాత్రమే చర్చించామన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. అమిత్ షా తో భేటీ సందర్భంగా రకరకాల ప్రచారాలు జరుగుతుండటంతో మీడియా ముందుకు వచ్చి , అమిత్ షా తో భేటీ వివరాలను మీడియాకు వెల్లడించారు.