అమిత్ షా తో భేటీలో మాట్లాడింది ఇదే – నారా లోకేష్

Nara Lokesh met Union Home Minister Amit Shah in New Delhi on Wednesday night. Daggubati Purandhareswari and Kishan Reddy are in the photo

బుధువారం సాయంత్రం ఢిల్లీ లో కేంద్ర మంత్రి అమిత్ షా తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి లు భేటీ ఐన సంగతి తెలిసిందే. ఈ భేటీ లో టీడీపీ – జనసేన – బిజెపి పొత్తుల ఫై చర్చలు జరిపారని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండడం తో..ఈ వార్తలపై నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

అమిత్ షా తో భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలను ప్రస్తావించలేదని నారా లోకేష్ వివరణ ఇచ్చారు. ఈ భేటీలో కేవలం కేసులపై మాత్రమే చర్చించామన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. అమిత్ షా తో భేటీ సందర్భంగా రకరకాల ప్రచారాలు జరుగుతుండటంతో మీడియా ముందుకు వచ్చి , అమిత్ షా తో భేటీ వివరాలను మీడియాకు వెల్లడించారు.