‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటన
నవీన్ పోలిశెట్టి – అనుష్క జంటగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ . ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని చాల రోజులు అవుతున్న థియేటర్స్ లోకి వచ్చేందుకు మాత్రం వెనుకాముందు అవుతుంది. ఇప్పటికే పలు రిలీజ్ డేట్స్ చేంజ్ కాగా..తాజాగా మరోసారి కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.
సెప్టెంబర్ 7న చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ అధికారిక పోస్టర్ను విడుదల చేశారు. అలాగే నవీన్..సినిమా రిలీజ్ డేట్ ను తెలియజేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో జ్యోతిష్యుడు రంగస్థలం మహేశ్ ను ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ డేట్ చెప్పమని అడగడం, అతను 70, 80 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసుకోమని అనడం.. చివరకు నవీన్ పోలిశెట్టి హే కృష్ణా అంటూ ఉట్టికొట్టి కృష్ణామికి మా సినిమాను తీసుకొస్తున్నాం అని ప్రకటించడం ఇంట్రెస్టింగ్గా, హ్యూమర్ క్రియేట్ చేసింది.