ఉత్తరాంధ్ర భూములపైనే వైస్సార్సీపీ కి ప్రేమ – పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..అధికార పార్టీ వైస్సార్సీపీ ఫై వరుస విమర్శలు చేస్తూ వస్తున్నారు. మూడు రోజులుగా ఉత్తరాంధ్ర పర్యటన లో బిజీ గా ఉన్న పవన్ నేడు..విసన్నపేట భూములను సందర్శించి..ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్ర మీద ప్రభుత్వానికి ప్రేమ లేదని.. కేవలం ఉత్తరాంధ్ర భూములు మీదే ప్రేమ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో యువతకు ఉపాది లేదని.. జాబ్ క్యాలెండర్ లేదని మండిపడ్డారు. అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. వోల్టా చట్టం తుంగలోకి తొక్కారన్నారు.

ఈ ఉరిలోకి రావడానికి ఇరుకు రోడ్ ఉందని.. కానీ వీరి రియల్ ఎస్టేట్‌కు మాత్రం పెద్ద రోడ్ వేసుకున్నారని మండిపడ్డారు. ‘‘మంత్రి గుడివాడ అమర్నాథ్ కాదు.. నేను సీఎంనే అడుగుతున్నాను. ఏంటీ ఈ దోపిడీ, దాష్టీకం’’ అంటూ ప్రశ్నించారు. కొండలను పిండి చేశారని.. ప్రభుత్వ భూములు, రైతులు భూములను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.