తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ

మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ తమ సత్తా చాటాలని చూస్తుంటే..తెలంగాణ లో రాబోయే ఎన్నికల్లో శివసేన పోటీ చేయబోతోందని ప్రకటించారు శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ. తెలంగాణలో బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, మహారాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లోని నియోజకవర్గాలపై దృష్టి సారించినట్టు తెలిపారు.

తెలంగాణలో బీఆర్ఎస్, ఎంఐఎంలు రహస్య మిత్రులని… వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు శివసేన సత్తా ఏమిటో రుచి చూపిస్తామని అన్నారు. హైదరాబాద్ లో శివసేన బహిరంగసభను నిర్వహించబోతున్నామని… ఈ సభకు ఏక్ నాథ్ షిండే హాజరవుతారని తెలిపారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఏ మాత్రం ఉండదని శివాజీ అన్నారు.