కాంగ్రెస్ అభ్యర్థుల కొత్త జాబితా విడుదల
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/11/telangana-congress-released-final-list-of-candidates-jpg.webp)
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్స్ పార్టీ కొత్తగా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గుర్గావ్ నియోజకవర్గం నుంచి రాజకీయవేత్తగా మారిన నటుడు రాజ్ బబ్బర్, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా నియోజకవర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ ఉన్నారు.
అలాగే, హమీర్పూర్ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే సత్పాల్ రైజాదా, ముంబై నార్త్ నుంచి భూషణ్ పాటిల్లను ఎంపిక చేసింది. అయితే, ఎన్నికల నామినేషన్ల దాఖలుకు మూడు రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ కాంగ్రెస్ కంచుకోటలు అమేఠీ, రాయ్బరేలీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.