గ్యాంగ్ రేప్‌ ఘ‌ట‌న‌..తెలంగాణ సీఎస్, డీజీపీల‌కు నోటీసులు

ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ ప్రారంభించిన జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌

హైదరాబాద్ : హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపుతున్న ఆమ్నేషియా ప‌బ్ గ్యాంగ్ రేప్‌పై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ కూడా దృష్టి సారించింది. ప‌బ్ వ‌ద్ద‌కు వచ్చిన ఓ మైన‌ర్ బాలిక‌ను కారులో ఎక్కించుకున్న ఐదుగురు యువ‌కులు కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లు ఆందోళ‌న వ్యక్తం చేయ‌డంతో ఇప్ప‌టికే పోలీసులు ఐదుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో అస‌లు దోషుల‌ను పోలీసులు కాపాడుతున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి త‌రుణంలో ఈ ఘ‌ట‌న‌పై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ విచార‌ణ ప్రారంభించింది. ఈ మేర‌కు ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అంద‌జేయాలంటూ తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డీజీపీల‌కు మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది. మ‌రోవైపు సికింద్రాబాద్ ప‌రిధిలో చోటుచేసుకున్న అత్యాచార ఘ‌ట‌న‌పైనా విచార‌ణ మొద‌లుపెట్టిన‌ట్టు మ‌హిళా క‌మిష‌న్ ప్ర‌క‌టించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/