నేను తెచ్చిన కంపెనీ అది..నువ్వు ఒక్కటైనా తెచ్చావా ..అంటూ జగన్ కు లోకేష్ సూటి ప్రశ్న..

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా నేటితో 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం పూర్తి కావడం తో తిరుపతి నియోజకవర్గం లో అడుగుపెట్టాడు లోకేష్. నేటి యాత్ర లో రోజూవారిలాగానే సీఎం జగన్ ఫై నిప్పులు చెరిగారు. జోహో ఐటీ కంపెనీ ని చూపిస్తూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు.

“జగన్ మోహన్ రెడ్డీ ఇదిగో నేను రేణిగుంటకు తెచ్చిన జోహో ఐటీ కంపెనీ… జోహో కంపెనీ లో పనిచేస్తున్న నా చెల్లెమ్మల కళ్ళలో ఆనందం చూడు జగన్ రెడ్డి. ఇక్కడ వంద మంది యువతీ, యువకులు పని చేస్తున్నారు. నీ హయాంలో ఒక్క కంపెనీ వచ్చిందా? ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరిమేసి, ఉద్యోగాలు లేకుండా చేసే జగన్ రెడ్డికి ఉద్యోగం వస్తే యువతీ, యువకులు పడే ఆనందం గురించి తెలియాలి అనుకోవడం అత్యాశే అవుతుంది. నా సెల్ఫీ ఛాలెంజ్ కొనసాగుతుంది. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీల ముందు నేను సెల్ఫీ దిగుతాను. జగన్ రెడ్డి తెచ్చిన లిక్కర్ కంపెనీలు తప్ప ఏమైనా ఉంటే సెల్ఫీ దిగి పోస్ట్ చెయ్యాలి” అంటూ సవాల్ విసిరారు.