హైదరాబాద్‌ మెట్రో సేవలకు అంతరాయం

అరగంటకుపైగా నిలిచిన రైళ్లు

hyderabad-metro-trains-stalls-for-30-minutes-due-to-technical-glitch

హైదరాబాద్ః హైదరాబాద్‌ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలతో ఖైరతాబాద్‌లోని మెట్రోస్టేషన్‌లో ఓ రైలు నిలిచిపోయింది. దీంతో మియాపూర్‌-ఎల్బీనగర్‌ మార్గంలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సుమారు అరగంటకుపైగా రైళ్లు నిలిచిపోవండంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పునరుద్ధరణ చర్యల అనంతరం మెట్రో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/