బస్సు ప్రయాణికులతో ముచ్చటించిన నారా లోకేష్

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా సాగుతుంది. మండు ఎండను సైతం లెక్కచేయకుండా లోకేష్ యాత్రను కొనసాగిస్తున్నాడు. లోకేష్ యాత్ర కు ప్రజలు బ్రహ్మ రథంపడుతుండడం తో లోకేష్ అంతే ఉత్సహం తో ముందుకు వెళ్తున్నాడు. ఓ పక్క ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ , మరోపక్క ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతున్నారు.

ఈరోజు బుధువారం లోకేష్ యువగళం పాదయాత్ర సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. పిచ్చాటూరులో పాదయాత్ర సందర్భంగా లోకేశ్ అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సులోకి ఎక్కారు. ప్రయాణికులతో మాట్లాడారు. ఇప్పటిదాకా మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారని లోకేశ్ అన్నారు. అన్నీ పెరుగుతూనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా బస్సు చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి సెల్ఫీలు దిగారు. జాగ్రత్త అమ్మా… వెళ్లొస్తా… అంటూ ప్రయాణికుల నుంచి వీడ్కోలు తీసుకున్నారు.