ప్రమోషన్లకే రూ. 20 కోట్లా..రాజమౌళి ఎక్కడ తగ్గేదెలా..

సినిమాను భారీ ఎత్తున నిర్మించడమే కాదు భారీ ఎత్తున ప్రమోషన్ చేయాలి..అప్పుడే జనాలు థియేటర్స్ కు వస్తారు. దానికి టాక్ బాగుందని వస్తే ఇంకా ప్రేక్షకులను ఆపడం ఎవరి వల్ల కాదు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ యూనిట్ చేస్తుంది కూడా అదే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ జనవరి 07 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. డివివి దానయ్య దాదాపు రూ. 450 కోట్లకు పైగా ఖర్చు తో నిర్మించారు. ఈ మూవీ ఫై అన్ని భాషల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఈ మూవీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేశారు చిత్ర మేకర్స్. ఆర్ఆర్ఆర్ ప్రచారానికి ఏ ప్లాట్ ఫామ్ ని వదలకుండా వాడేస్తున్నారు రాజమౌళి. ఉత్తరాదిపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన రాజమౌళి ముంబైలో వారం పాటు అక్కడే మకాం వేసి బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ ప్రచారానికి ఎన్ని ప్లాట్ ఫామ్ లు వున్నాయో వాటన్నింటిని విజయవంతంగా ఉపయోగించుకున్నారు.

‘ఆర్ఆర్ఆర్ప్రమోషన్స్ కోసం నిర్మాత డీవీవీ దానయ్య ఏకంగా 20 కోట్లు కేటాయించారని తెలిసింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రేంజ్ బడ్జెట్ ని కేటాయించారు కాబట్టే రాజమౌళి ప్రచార బాధ్యతల్ని తీసుకుని మరీ ఈవెంట్ లని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తూ వస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లని నిర్వహించినఆర్ఆర్ఆర్` టీమ్ త్వరలోనే తెలుగులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతోంది. మరి ఆ ఈవెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.