దయాకర్ రెడ్డి మృతిపై స్పందించిన రేవంత్ , నారా లోకేష్

సీనియర్ రాజకీయ నేత , మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతూ హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన.. మంగళవారం తుదిశ్వాస విడిచారు. దయాకర్ మృతి ఫై ఇప్పటికే సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ నేతలు, ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేయగా..తాజాగా రేవంత్ రెడ్డి , నారా లోకేష్ లు స్పందించారు.

కొత్తకోట దయాకర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. కుటుంబ సభ్యులకు నారా లోకేష్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డి సైతం దయాకర్ రెడ్డి మృతి ఫై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఒక మంచి ప్రజా నాయకుడు దయాకర్ రెడ్డి మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండి జనం కోసం పోరాడే నేత దయాకర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన కుటుంబానికి రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.