బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిజమాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన సురేష్ హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి సురేష్ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, మృతుడు ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నాడు. సూసైడ్ కు గల కారణాలు తెలియరాలేదు.
విద్యార్ధి ఆత్మహత్యతో మిగతా స్టూడెంట్స్ ఆందోళనకు దిగడంతో ట్రిపుల్ ఐటీ లో ఉద్రిక్తత నెలకొంది. పలు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు తోటి విద్యార్థులు. విద్యార్థి మృత దేహాన్ని పోలీసులు భైంసా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా అధికారులు పట్టించుకోలేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. సురేష్ చనిపోయి గంటసేపు అయినా అంబులెన్స్ కోసం ఎవ్వరూ ఫోన్ చేయలేదని.. ఆస్పత్రికి తరలించేందుకు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.