తొలి జాబితాలోనే చంద్రబాబు, పవన్ పేర్లు?

మరికాసేపట్లో టిడిపి – జనసేన పార్టీల కు సంబదించిన మొదటి లిస్ట్ ను ప్రకటించబోతున్నాయి. ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే వైసీపీ పలువుర్ని ప్రకటించగా..ఇప్పుడు టిడిపి కూడా మొదటి జాబితాను ఈరోజు రిలీజ్ చేయబోతుంది. జనసేన తో పొత్తు పెట్టుకున్న టిడిపి..గత కొద్దీ రోజులుగా ఇరు పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు.

ఈ క్రమంలో అభ్యర్థులకు సంబదించిన కసరత్తులు పూర్తి కావడం తో ..దాదాపు 90 మంది ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. టిడిపి నుండి 75 , జనసేన పార్టీ నుండి 15 మందితో కూడిన పేర్లను ప్రకటించబోతుంది. ఈ ఫస్ట్ లిస్ట్ లో చంద్రబాబు (కుప్పం), పవన్ కళ్యాణ్ (భీమవరం), అచ్చెన్నాయుడు (టెక్కలి), లోకేశ్ (మంగళగిరి), నాదెండ్ల మనోహర్ (తెనాలి) పేర్లు తొలి జాబితాలో ఉంటాయని ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి.