అక్కినేని నాగార్జున ఇంట విషాద ఛాయలు

అక్కినేని నాగార్జున ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి.నాగార్జున సోదరి నాగ సరోజ కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె..ముంబై లో కన్నుమూశారు. అక్కినేని నాగేశ్వరరావుకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అందులో నాగ సుశీల, నాగ సత్యవతి, నాగ సరోజ కుమార్తెలు కాగా…వెంకట్, నాగార్జున కుమారులు.

అయితే నాగ సత్యవతి కొన్నేళ్ల క్రితం కన్నుమూయగా..తాజాగా నిన్న రాత్రి నాగ సరోజ మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న నాగార్జున షూటింగ్స్ అన్నింటికి బ్రేక్ ఇచ్చి…హుటా హుటిన బయలుదేరి, అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక ఈ విషయం తెలిసి చిత్రసీమ ప్రముఖులు నాగార్జున కు ధైర్యం చెపుతూ..నాగ సరోజ ఆత్మ కు శాంతి కోరుతున్నారు.