గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్

వివేకా హత్య కేసులో ఏ-1గా ఉన్న గంగిరెడ్డి

CBI

అమరావతిః మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మర్డర్ కేసులలో ఎర్ర గంగిరెడ్డి ఏ-1గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు గతంలో ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో, గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ మొదట హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం సీబీఐ విన్నపాన్ని తోసిపుచ్చింది. ఈ క్రమంలో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/