‘థాంక్యూ సీఎం గారు..గుర్తుండిపోయేలా స్వాగతం పలికారు’ – మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్

మెగా బ్రదర్ నాగబాబు దూకుడు పెంచారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్య కర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. గత మూడు రోజులుగా జనసేన నిర్వహించిన #GoodMorningCMSir డిజిటిల్ క్యాంపెయిన్ భారీ సక్సెస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితిని ఫొటోస్ , వీడియోస్ తీసి సోషల్ మీడియా లో ట్రెండ్ లో పెట్టారు. జనసేన నిర్వహించిన ఈ కార్యక్రమంతో ప్రభుత్వం దిగొచ్చింది. రోడ్ల వేయడం మొదలుపెట్టింది. ఇదిలా ఉంటె తాజాగా నాగబాబు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.

‘థాంక్యూ ఆంధ్రప్రదేశ్ సీఎం గారు.. ఇంత అందమైన రోడ్లను అందించినందుకు.. గుర్తుండిపోయేలా పశ్చిమగోదావరి జిల్లా సిద్ధవటంకు స్వాగతం పలికారు’అంటూ నాగబాబు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసారు. అంతేకాదు రాజమండ్రిలో రోడ్ల పరిస్థితిపై నేరుగా ఆయన నిరసనకు దిగారు. జనసైనికులతో కలిసి ప్లకార్డులు చేతబట్టి #GoodMorningCMSir అంటూ ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటె జనసేన చేపట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ కు కౌంటర్ గా బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్తుడూ..రోడ్లు బాగున్నాయ్..అంటూ కౌంటర్ కు దిగింది. జనసేన నేతలు పెట్టిన ఫొటోలకు కౌంటర్ గా బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడు పేరుతో వైసీపీ పెడుతున్న ఫొటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.