మరోసారి అండమాన్ దీవుల్లో భూకంపం.. 4.6 తీవ్రత
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూమి కంపించింది. ఈరోజు ఉదయం 5.56 గంటలకు అండమాన్ సముద్రంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదయింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి పొరలు కదిలాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
కాగా, సోమవారం ఉదయం నుంచి అండమాన్ దీవుల్లో భూమి కంపించడం ఇది 22వసారి. సోమవారం ఉదయం 5.42కు ప్రారంభమైన భూకంపాల పరంపర కొనసాగుతున్నది. 3.8 నుంచి 5.0 తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/