ఘోర ప్రమాదం..నదిలోపడ్డ బస్సు.. 12 మంది మృతి

bus-fell-down-into-river-in-madhya pradesh

భోపాల్‌ః మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బస్సు అదుపు తప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 12 మృత దేహాలను వెలికితీశారు. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ధార్‌ జిల్లా ఖాల్‌ఘాట్‌ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. మిగతా వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. బస్సు ఇండోర్‌ నుంచి పుణె వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై శివరాజ్ ప్రభుత్వ కేబినెట్ మంత్రి నరోత్తమ్ మిశ్రా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. పదిహేను మందిని కాపాడగలిగామని చెప్పారు.

ఈ ఘటనపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ మాట్లాడుతూ.. అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ధార్ జిల్లాలోని ఖల్ఘాట్ వద్ద నర్మదా నదిలో ప్రయాణికులతో నిండిన బస్సు పడిపోవడంపై విచారణ వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ వర్క్ చేయడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించే పనిని చేయవచ్చని నేను ప్రభుత్వానికి సూచించినట్లుగా పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/