SSMB28 షూటింగ్ ఆగిపోయిందనే ప్రచారం ఫై నిర్మాత నాగ వంశీ క్లారిటీ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో SSMB28 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి కాగా..తాజాగా ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయిందని , మహేష్ – త్రివిక్రమ్ కు మధ్య విభేదాలు వచ్చాయని , అందుకే సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందని సోషల్ మీడియా లో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ ప్రచారం ఫై నిర్మాత నాగ వంశీ స్పందించారు.

‘తిండి కోసం అన్వేషించే పక్షులు గట్టిగా శబ్దం చేస్తాయి. అలాగే ఎవరైనా తమ అటెన్షన్ కోసం ట్రై చేసేటప్పుడు గాసిప్స్ను స్ప్రెడ్ చేస్తారు. వాటిని చూసి నవ్వుకోవడం లేదంటే పట్టించుకుండా వదిలేయాలి. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలి. సూపర్ ఫ్యాన్స్… SSMB 28 సినిమా ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఉంటుంది. మీరు వినాలనుకునేది వినండి. కానీ, ఈ స్టేట్‌మెంట్ గుర్తు పెట్టుకోండి. ఈ గాసిప్ రాయుళ్లు రాసే వార్త‌ల ప్ర‌కారం సినిమాల‌ను చేస్తే మూవీ ఇండ‌స్ట్రీకి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుందేమో. SSMB 28 డెఫ‌నెట్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌. ఇది మా మాట‌గా గుర్తు పెట్టుకోండి’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ తో సినిమా షూటింగ్ ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సూప‌ర్ స్టార్ స‌ర‌స‌న పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.