యూపీలో అమానవీయ ఘటన : గణేశుడి ప్రతిమను తాకినందుకు ఓ దళిత బాలుడిపై దాడి

ఉత్తరప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గణేశుడి ప్రతిమను తాకినందుకు ఓ దళిత బాలుడిపై దాడి చేసిన ఘటన ఇప్పుడు చర్చకు దారితీసింది. దేవుడంటే అందరి వాడని..అన్ని కులాలవారు , మతాలవారు పూజించేవారని..అందర్నీ ఆయన సమానంగా చూస్తారని..దేవుడి ముందు అంత సమానమని భావిస్తుంటాం. అయితే ఉత్తరప్రదేశ్ లో ఓ దళిత బాలుడు వినాయకుడ్ని తాకడని దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

కన్నౌజ్‌ జిల్లాలోని సదర్‌ కొత్వాలి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా గణేశుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. దళిత వర్గానికి చెందిన సన్నీ గౌతమ్‌ అనే బాలుడు స్నేహితులతో ఆడుకుంటూ మండపంలోకి వెళ్లి గణేశుడి ప్రతిమ పాదాలను తాకే యత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న మండపం నిర్వాహకుడు బబ్బన్‌ గుప్త తన ఇద్దరు కుమారులతో కలసి బాలుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ బాధిత బాలుడికి గాయాలయ్యాయి. దీనిపై దళిత బాలుడి తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ బాలుడు మద్యం తాగి మండపంలోకి రావడం వల్ల గొడవ జరిగిందని బబ్బన్‌ గుప్త కుటుంబం తెలిపింది. మరి నిజ నిజాలను పోలీసులు తేల్చనున్నారు.