గాలిపటం దారానికి నిండు ప్రాణం బలి

గాలిపటం మాంజా దారానికి మరో నిండు ప్రాణం గాల్లో కలిసింది. ముంబైకి చెందిన ఓ కానిస్టేబుల్ మెడకు మాంజా చుట్టుకోవడంతో దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై చోటుచేసుకుంది. సమీర్ జాదవ్ దిన్‌దోషీ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌‌గా విధులు నిర్వహిస్తున్న సమీర్…. ఆదివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరారు.

మార్గమధ్యంలో వకోలా వంతెన వద్ద మాంజా ఆయన మెడకు చుట్టుకోవడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు ఆయనను సమీపంలోని సియాన్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఖేర్వాదీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.