అమరావతి ఎంపీ నవనీత్, ఆమె తండ్రిపై నాన్‌ బెయిల్‌ వారెంట్‌ జారీ

Mumbai court issues fresh non-bailable warrant against MP Navneet Rana, her father

ముంబయిః అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, ఆమె తండ్రిపై నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో ముంబయి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. అంతకు ముందు సెప్టెంబర్‌లోనూ ఎంపీతో పాటు ఆమె తండ్రిపై వారెంట్‌ జారీ అయ్యింది. ఈ క్రమంలో కొనసాగుతున్న కేసుపై సోమవారం మరోసారి కోర్టులో విచారణ జరిగింది. వారెంట్‌ అమలు కోసం మరింత సమయం కావాలని పోలీసులు కోరారు.

పోలీసుల విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ నవనీత్‌ రాణాతో పాటు ఆమె తండ్రిపై తాజాగా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆ తర్వాత సర్వీస్ ఆఫ్‌ వారెంట్‌పై నివేదికను సమర్పించేందుకు కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా చేశారు. ఎంపీ నవనీత్‌ రాణా, ఆమె తండ్రి నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/