మరోసారి సీఎం కేసీఆర్ ఫై పొంగులేటి ఫైర్..

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ..మరోసారి సీఎం కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. నిరంకుశ వైఖరితో ప్రజల గొంతు నొక్కుతున్న బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్​కు బుద్ధి చెప్పి గద్దె దించడానికి యువత సిద్ధంగా ఉందని , మల్లారెడ్డి లాంటి వారి ప్రయోజనం కోసం ప్రైవేటు కాలేజీలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసి విద్య, వైద్యాన్ని పేదలకు దూరం చేసిన ఘనుడు కేసీఆర్​అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

బుధవారం సాయంత్రం కూకట్​పల్లి ఎల్లమ్మబండలోని ఓ ఫంక్షన్​హాల్​లో ఏర్పాటు చేసిన రాజకీయ అవగాహన సదస్సుకు పొంగులేటి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..నిరుద్యోగ భృతి అంటూ యువతను మభ్యపెడుతున్న కేసీఆర్ మాటలను నమ్మొద్దన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులు, యువతను మభ్య పెడుతున్న కేసీఆర్​ఆటలు ఇక సాగవన్నారు. నిరంకుశ వైఖరితో ప్రజల గొంతు నొక్కుతున్న బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్​కు బుద్ధి చెప్పి గద్దె దించడానికి యువత సిద్ధంగా ఉందన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్​లీకేజీ వెనుక పెద్ద కుట్ర ఉందని, అది బయటకు రాకుండా విచారణ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. అన్యాయానికి గురవుతున్న యువత అధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.