సత్తుపల్లి లో విషాదం ..బిడ్డలను చెరువులోకి తోసేసి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో విషాదం చోటుచేసుకుంది. ఓ త‌ల్లి త‌న ఇద్ద‌రు కుమారుల‌ను చెరువులోకి తోసేసి, అనంత‌రం ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది. స‌త్తుప‌ల్లిలోని తామెర చెరువు లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ముగ్గురి మృత‌దేహాల‌ను గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు స్థానికుల స‌హాయంతో మృత‌దేహాల‌ను చెరువులో నుంచి బ‌య‌ట‌కు తీశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల‌ను త‌ల్లి మృదుల‌, ప్ర‌జ్ఞ‌(5), మ‌హ‌దేవ్‌(7) గా పోలీసులు గుర్తించారు. వీరి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన తో కుటుంబంలో విషాదం నెలకొంది.