ప్రజల మనసులో ‘టంగుటూరి’ చిరస్మరణీయం

ఏపీ సీఎం జగన్

Tribute to the Tanguturi Prakasam pantulu
Tribute to the Tanguturi Prakasam pantulu

స్వాతంత్ర్య పోరాట యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు కూ యాప్ లో సీఎం పోస్ట్ చేశారు.
తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో చిరస్మరణీయంగా నిలిచిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శం అని సీఎం పేర్కొన్నారు

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/