కాబోయే కేంద్రమంత్రులకు మోడీ ‘టీ పార్టీ’..

ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోడీ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం ఏడు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ తరుణంలో కాబోయే కేంద్రమంత్రులకు మోడీ ‘టీ పార్టీ’ ఇచ్చారు. ఈ పార్టీ లో తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస వర్మ (బీజేపీ) రామ్మోహన్ నాయుడు (టీడీపీ), పెమ్మసాని చంద్రశేఖర్‌ (టీడీపీ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… పరిపాలనపై దృష్టి సారించాలని, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో బీజేపీ, ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ఎంపీలు ఉన్నారు. అమిత్ షా (బీజేపీ), నితిన్ గడ్కరీ (బీజేపీ), జ్యోతిరాదిత్య సింధియా (బీజేపీ), శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ), పియూష్ గోయల్ (బీజేపీ), నిర్మలా సీతారామన్ (బీజేపీ), అశ్విని వైష్ణవ్ (బీజేపీ), మన్సుఖ్ మాండవియా (బీజేపీ), గిరిరాజ్ సింగ్ (బీజేపీ), హర్దీప్ సింగ్ పూరి (బీజేపీ), మనోహర్ లాల్ ఖట్టర్ (బీజేపీ), అర్జున్ రామ్ మేఘ్వాల్ (బీజేపీ), కమల్‌జీత్ సెహ్రావత్ (బీజేపీ), రక్షా ఖడ్సే (బీజేపీ) , జార్జ్ కురియన్ (బీజేపీ), రవ్‌నీత్ సింగ్ బిట్టు (బీజేపీ), సీఆర్ పాటిల్ (బీజేపీ), హెచ్‌డి కుమారస్వామి (జెడి-ఎస్), జయంత్ చౌదరి (రాష్ట్రీయ లోక్ దళ్), లలన్ సింగ్ (జేడీయూ), జితన్ రామ్ మాంఝీ (HAM), రాందాస్ అథవాలే (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా), ప్రతాప్రా జాదవ్ (షిండే నేతృత్వంలోని శివసేన) తదితరులు ఉన్నారు.