లోక్ సభ స్పీకర్ పదవి పై పురందేశ్వరి క్లారిటీ

ఏపీ బీజేపీ ఛీఫ్ పురంధేశ్వరికి 18వ లోక్ సభ స్పీకర్ గా కేంద్రం బాధ్యతలు అప్పగించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఫై పురందేశ్వరి క్లారిటీ ఇచ్చింది. “ఏపీలో మేం కూటమిగా పోటీ చేశాం. కేంద్ర క్యాబినెట్ కూర్పు నేపథ్యంలో, టీడీపీ వాళ్లు రెండు పేర్లు ఇచ్చారు… వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. మొదటి నుంచి బీజేపీ కార్యకర్తగా అంకితభావంతో పనిచేస్తున్న భూపతిరాజు శ్రీనివాసవర్మను కూడా క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఇప్పుడు ఏపీ నుంచి కేంద్రమంత్రులుగా అవకాశం దక్కించుకున్న వాళ్లు కచ్చితంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. ఏపీకి నిధులు సాధించడానికి వీరంతా తమ వంతు కృషి కచ్చితంగా చేస్తారు.

అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు ఎంతో అవసరం. ఇక్కడ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. గడచిన ఐదేళ్లలో రాష్ట్రం ఏ విధంగా కుంటుపడిందో, ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైందో… ఆ లోటును అధిగమించేందుకు పెద్ద ఎత్తున వనరులు తెచ్చుకోవడం, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది” అని పురందేశ్వరి వివరించారు.