వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్

YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేసారు. దాదాపు 10 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇటీవల పాదయాత్ర సందర్భంగా షర్మిలపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ ఘటనకు నిరసనగా ధ్వంసమైన తన కారులో ఆమె ప్రగతి భవన్ కు బయల్దేరగా… ఆమె కారులో ఉండగానే వాహనాన్ని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ గా మారింది. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర కు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ , స్టునైక పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. మరోపక్క టిఆర్ఎస్ నేతలు సైతం షర్మిల ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో మోడీ ..షర్మిలకు ఫోన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షర్మిలను ప్రధాని ఫోన్ ద్వారా పరామర్శించినట్టు తెలుస్తోంది. ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు. ఢిల్లీకి రావాలని ఆమెకు సూచించారు. తనకు అండగా నిలిచి, పరామర్శించిన ప్రధానికి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీకి వచ్చి కలుస్తానని చెప్పారు. మరోవైపు నిన్న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా జగన్ తో మోదీ మాట్లాడుతూ షర్మిల విషయాన్ని లేవనెత్తినట్టు సమాచారం.