ఈరోజు అలీఘర్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ప్ర‌ధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈరోజు అలీఘర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొని, ప్రసంగించనున్నారు. అలాగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొననున్నారు. అంతకుముందు, ముఖ్యమంత్రి ఆగ్రాలోని కిరావాలి ప్రాంతంలో బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు. బరేలీలోని రోహిల్‌ఖండ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వాలంటీర్ సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి ప్రసంగించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, సీతాపూర్, బ్రజేష్ పాఠక్ లఖింపూర్ ఖేరీ, ఉన్నావ్‌లలో బీజేపీ బూత్ అధ్యక్షులు, జల్ శక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ హర్దోయ్, కాన్పూర్‌లో రాష్ట్ర మంత్రి ధరమ్‌వీర్ ప్రజాపతి సమావేశాలలో ప్రసంగిస్తారు. అ తర్వాత ప్రధాని ర్యాలీలో పాల్గొనన్నునారు. ఈ ర్యాలీ సందర్బంగా అలీగఢ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదని , పెద్ద వాహనాలు బైపాస్‌ మీదుగా వెళ్లాలని సూచించారు.