నాలుక కోస్తా అంటూ టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన వైస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

టీడీపీ నేతల నాలుక కోస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు వైస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. తాడేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ భారతి గురించి ఏమైనా మాట్లాడితే టీడీపీ నేతలు నాలుక కోస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫ్యామిలినే తాగుబోతు కుటుంబం అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

‘చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భువనేశ్వరి.. వేల కోట్లు ఆర్జించారు. మద్యం కంపెనీలన్నీ టీడీపీ వారివే. బ్రాండ్ల పేర్లతో దత్తపుత్రుడు, వియ్యంకుడి రుణం తీర్చుకున్నారు. మద్యం అనుమతుల వెనుక భువనేశ్వరి హస్తం ఉంది. ముడుపుల వాటా కోసమే భువనేశ్వరి, బ్రాహ్మణి మధ్య గొడవలు. భువనేశ్వరి, బ్రాహ్మణి గురించి మాకు అంతా తెలుసు. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకు చంద్రబాబు ఎలా ఎదిగారు?. ముడుపుల కోసం ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారు. మద్యం ముడుపులపై న్యాయ విచారణ జరగాలని అన్నారు.

ఆయన నారా చంద్రబాబు కాదు.. సారా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. నారా లోకేష్ కి మందు, మగువా లేనిదే నిద్ర పట్టదని సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు పైకి చేసేది పాల వ్యాపారం అని.. కానీ తెరవెనక నడిపేది సారా పరిశ్రమ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.