ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష
హైదరాబాద్ః భారత జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జీఓ నం.3 శరాఘాతంగా నిలుస్తోందని కవిత ఆరోపించారు. ఈ జీఓను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. ఈ జీఓ ద్వారా మహిళలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతోందని ఆమె అన్నారు. మహిళలకు న్యాయం జరిగే జీఓ నం.41ను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వ్యక్తిగత కారణాలతో చనిపోయిన అమ్మాయిని కూడా కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుందని ఆమె విమర్శించారు.