పెను ప్రమాదం నుండి బయటపడ్డ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. సోమవారం ఉదయం కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం శంషాబాద్‌ సమీపంలో కౌశిక్‌ రెడ్డి ప్రయాణిస్తున్న కారు బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. అయితే సమయానికి ఎయిర్ బెలూన్ తెరచుకోవడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో అతడిని సమీపంలోని హాస్పటల్ కు తరలించారు. పాడి కౌశిక్ రెడ్డి కారు పాక్షికంగా ధ్వంసమైంది.