ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటు విమర్శలు

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటు విమర్శలు చేసారు. బుధువారం మెదక్ పట్టణంలో తపస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..అడ్డదారిలో ఎమ్మెల్సీ అయిన కవిత ఉద్యమంలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఉద్యయాన్ని ఉదృతం చేసిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ ఎమ్మెల్యే లేదా ఎంపీ, ఎమ్మెల్సీ ఎందుకు కాలేదని ప్రశ్నించారు. 2014లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన సమయంలో కేసీఆర్ కేబినెట్లో ఒక్క మహిళా లేదని ఎమ్మె్ల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ సమయంలో కవిత తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఆమెకు తెలంగాణ మహిళలు బ్రహ్మరథం పట్టేవారన్నారు. మహిళల సమస్యల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని , మహిళలకు 33శాతం రిజ్వేషన్ బిల్లును త్వరలో పార్లమెంట్ లో ప్రవేశ పెడతామని రఘునందన్ అన్నారు.

మహిళా హక్కుల కోసం, మహిళా మంత్రి పదవుల కోసం మాట్లాడని తమ చెల్లె కవిత అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈరోజు ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఢిల్లీలో ధర్నా చేస్తున్నందుకే నోటీసుల ఇచ్చారని సింపతి కోసం జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మహిళలు కవిత చేస్తున్నటువంటి తప్పులని అర్థం చేసుకున్నారు కాబట్టి సానుభూతి లేదన్నారు. కవితకు ఇచ్చిన ఈడీ నోటీసులకు తెలంగాణ పౌర సమాజానికి సంబంధం లేదన్నారు. అలాగే ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటు వంటి అంశమని చెప్పారు. బీఆర్ఎస్ అధ్యక్షునికి చెప్పి కవిత ఈ వ్యాపారం చేసింది అనుకోవడం లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత తన వ్యక్తిగతంగా చేసుకున్న వ్యాపారo పై ట్వీట్ చేయడం బాధాకరమన్నారు.