సంఘటితంతో పల్లెల అభివృద్ధి
Wanaparthy: గ్రామస్తులంతా సంఘటితంగా ఉంటూ పల్లెలను అభివృద్ధి చేసుకోవాలని సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలంలో గల చిన్న మందడి, మంగంపల్లి గ్రామాలను స్మితా సబర్వాల్ సందర్శించారు. ఆమెతో పాటు సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ శ్వేతా మహంతిలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలంతా సంఘటితంగా ఉంటూ పల్లెలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బతికించు కోవాలన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టంపై ప్రతి అధికారి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com