అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం

జేసీ సోదరులకు వైఎస్సాఆర్‌సిపి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్‌..

kethireddy pedda reddy
kethireddy pedda reddy

తాడిపత్రి: అవినీతికి కేరాఫ్‌ అడ్రాస్‌ జేసీ దివాకర్‌రెడ్డి అని తాడిపత్రి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేసీ బ్రదర్స్‌ ఓటమి తర్వాత తాడిప్రతిలో ప్రజాస్వామ్య పాలన సాగుతోందన్నారు. తాడిపత్రిలో మట్కా నిర్వహించింది జేసీ సోదరులేనని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం అని పెద్దారెడ్డి సవాల్‌ విసిరారు. వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో జేసీ దివాకర్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఆలయాల నిర్మాణం కోసం వచ్చే విరాళాలను కూడా జేసీ దివాకర్‌ రెడ్డి స్వాహా చేశారని ఆరోపించారు. గ్రామాల్లో ముఠా కక్షలు రేపేందుకు కుట్ర చేస్తున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/