కక్షతోనే పట్టాభిపై దాడి..లోకేశ్
అమరావతి: టిడిపి నేత పట్టాభి దాడిని టిడిపి నేత నారా లోకేశ్ ఖండించారు. ‘టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై వైఎస్ఆర్సిపి గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆధారాలతో జగన్ అవినీతి పాలనను ఎండగడుతున్నారన్న కక్షతోనే పట్టాభిని లక్ష్యంగా చేసుకుని జగన్రెడ్డే దాడులు చేయిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.
‘మంత్రులే చంపుతాం, ఇంటికొచ్చి కొడతాం అని బెదిరించడంపై పోలీసులకు ఫిర్యాదుచేస్తే కనీసం పట్టించుకోలేదు. జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి వైఎస్ఆర్సిపి మంత్రులే వార్నింగ్ ఇచ్చి మరీ గూండాలతో దాడి చేయించారంటే ఎంతగా బరి తెగించారో అర్థమవుతోంది. మీ బెదిరింపులకు అదరం. మీ దాడులకు బెదరం. మీ అరాచకపాలనని అంతమొందించి తీరుతాం’ అని లోకేశ్ హెచ్చరించారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/