నిర్మల్‌ను పర్యాటక కేంద్రంగా తిర్చిదిద్దుతాం

నిర్మల్‌ మున్సిపాలిటీకి టిఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల చేసిన మంత్రి

indrakaran reddy
indrakaran reddy

నిర్మల్‌: నిర్మల్‌ను వైద్య, విద్య, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌ మున్సిపాలిటీకి టిఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను మంత్రి విడుదల చేశారు. నిర్మల్‌ పట్టణానికి ఇంద్రకరణ్‌ రెడ్డి మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించారు. నిర్మల్‌ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో చేసిన అభివృద్దితో పాటు చేయబోయే పనుల ప్రగతిని మేనిఫెస్టోలో వివరించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, భూగర్భ డ్రైనేజీ, రోడ్ల విస్తరణ, మెరుగైన వైద్య సేవలు, అత్యవసర వైద్య సేవల నిమిత్తం ట్రామ సెంటర్‌, విద్యార్థుల్లో వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు జిల్లా సైన్స్‌ సెంటర్‌, కాలుష్య నియంత్రణకు పొల్యూషన్‌ మానిటరింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు వంటి వాగ్దానాలను నెరవేరుస్తామని ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రకటించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/