స్కూల్ కు వెళ్లిన ఇద్దరు బాలికలు అదృశ్యం

చెరువు గట్టుపై స్కూల్ బాగ్స్ లభ్యం- జీడిమెట్ల సూరారం కాలనీలో ఆందోళన

Missing two girls
Missing two girls

Hyderabad: ఇద్దరు బాలికలు అదృశ్యం కావటం ఆందోళన కల్గించింది. శనివారం ఉదయం స్కూల్ కు వెళ్లిన ఇద్దరు బాలికలు మళ్ళీ ఇంటికి రాకపోవటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జీడిమెట్ల పరిధిలోని సూరారం కాలనీకి చెందిన మౌనిక, గాయత్రి స్థానికంగా ఉన్న స్కూల్ లో టెన్త్ చదువుతున్నారు. వారిద్దరూ కలిసి పాఠశాలకు వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన పిల్ల జాడ తెలియలేదు. ఇదిలా ఉండగా , బాలికల స్కూల్ బ్యాగ్స్ సమీపంలో ని సూరారం చెరువుగట్టుపై లభించాయి. ఈ విషయంపై బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/