మధ్యప్రదేశ్ లో దారుణం : స్నేహితుడి కూతురి ఫై సామూహిక అత్యాచారం

ఈరోజుల్లో కామాంధులు వావివరుసలు మరచిపోతున్నారు. వారి కామ కోరిక తీర్చుకోవడం కోసం ఆడదైతే చాలు..అది ఎవరైనా పర్వాలేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కొంతమంది కన్నబిడ్డల పైనే అత్యాచారానికి పాల్పడుతుంటే..కొంతమంది స్నేహితుల భార్యల ఫై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా స్నేహితుడి కూతురిపైనా సామూహిక అత్యాచారం చేసిన ఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ లో స్నేహితుడి కుమార్తెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. 7వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై 25,25 ఏళ్ల వయస్సున్న ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. పెరట్లో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. డిసెంబర్ 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంలో నిందితులిద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 11న బాలికపై చేస్తున్న రేప్ ను చూసిన పక్కింటి మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.