తెనాలిలో అర్ధరాత్రి అన్నా క్యాంటీన్‌కు నిప్పు

గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్‌కు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి అన్న క్యాంటీన్‌ తలుపు వద్ద నిప్పు పెట్టారు. భవనం ముందు భారీగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు మంటలార్పారు. మంటలను అదుపు చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఏపీలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మూసివేసింది. మరింత మెరుగ్గా వాటిని నిర్వహిస్తామని చెప్పింది. అయినప్పటికీ ఆచరణలోకి రాలేదు. దీంతో అన్నా క్యాంటీన్లు అన్నీ మూతపడ్డాయి. అన్నా క్యాంటీన్లు తిరిగి తెరవాలంటూ ప్రతిపక్ష నేతలు పలుమార్లు ఆందోళనలు కూడా చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మళ్లీ టిడిపి నేతలు అన్న క్యాంటీన్‌లు ప్రారంభిస్తుంటే ఇలా దుండగులు నిప్పు పెట్టడం , కూల్చేయడం చేస్తున్నారు.