పూణే లో ఘోర ప్రమాదం..4 మృతి

నిత్యం రోడ్డు ప్రమాదాలు అమాయకపు ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని పూణే లో జరిగిన రోడ్ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు.

సోమవారం పూణె-బెంగళూరు హైవేపై స్వామినారాయణ దేవాలయం, నవ్లే వంతెన సమీపంలో రాత్రి 9.30 గంటల సమయంలో ట్రక్కు ఢీకొనడంతో నలుగురు మరణించారు. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ట్రక్కు కంటైనర్‌ను ఢీ కొట్టడం.. ఆపై మరో ట్రక్కును ఢీ కొట్టడం.. ఆ తర్వాత ట్రక్కును ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో ట్రక్కు లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పూణె మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాలిపోతున్న ట్రక్కులో నుంచి బాధితుల మృతదేహాలను తొలగించి ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగినప్పుడు ట్రక్కులో ఆరుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు.

ట్రక్కులో ప్రమాద సమయంలో ఉన్న వారిలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు ట్రక్కు నుంచి దూకి తప్పించుకోగలిగారు. వారు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారని పోలీసులు చెప్పారు.