బెలూచ్ చెక్పోస్టు వద్ద కాల్పులు
ఆరుగురు సైనిక సిబ్బంది మృతి
ఇస్లామాబాద్: బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని పాకిస్తాన్ చెక్పోస్టు వద్ద మిలిటెంట్ గ్రూపులకు, సైనిక దళాలకు మధ్య జరిగిన దాడుల్లో ఏడుగురు పాక్ సూనిక సిబ్బంది చనిపోయారు. ఆదివారం ఉదయం ఇరుపక్షాల మధ్య పరస్పరం తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. బెలూచ్, ప్రావిన్స్లోని హర్నా§్ు చెక్పోస్తువద్ద పాక్ ప్రాంటియర్ కార్ప్స్మిలిటెంట్ గ్రూపుల మధ్య భీకరపోరు జరిగింది.
సీనియర్ పోలీస్ అధికారి షాలి తరీన్ మరణాలు మరింత ఎక్కువ ఉండవచ్చని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం జరిగిన ఈకాల్పుల్లో భారీ ఎత్తున పోరు జరిగిందని వివరించారు. పర్వత శ్రేణుల్లోకి వెళ్లేందుకు వచ్చిన మిలిటెంట్లను సెక్యూరిటీ బృందాలు అడ్డగించడంతో వారితో ఘర్షణకు దిగారు.
అంతకు ముందురోజే ఒక సాకర్ క్షేత్రంలో బాంబు పేలింది. ఇద్దరు ప్రేక్షకులు చనిపోగా మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన నైరుతి బెలూచిస్తాన్లో జరిగింది. ఆదివారం నాటి దాడికి తామే బాధ్యులమని ఏ ఒక్కగ్రూప్ ఇప్పటివరకూ ప్రకటించలేదు.
గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగితే ఇస్లామిక్ మిలిటెంట్లు తమదే బాధ్యత అని చెప్పారు. దశాబ్దకాలానిక పైగా బెలూచిస్తాన్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. బెలూచ్ వేర్పాటువాదులు తమ ప్రాంతానికి పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పించాలని, స్థానికంగా ఉన్న సహజవాయు, ఖనిజవనరుల్లో స్థానికులకే ప్రాధాన్యం ఉండాలని పట్టుబడుతున్నారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/