ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న మంత్రి రోజా

రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఏర్పటు చేసారు మంత్రి రోజా. దత్తత గ్రామం మీరా సాహెబ్‌ పాలెంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు రోజా. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి ఆమె పాల్గొన్నారు. అంతే కాదు మంత్రి రోజా స్వయంగా గరెట పట్టడం విశేషం. ఇక మీరాసాహెబ్‌ పాళెం, వేలావడి గ్రామాల్లోని 2,380 కుటుంబాలకు పార్టీ శ్రేణుల ద్వారా విందు, చీరలను పంపిణీ చేశారు.

ఇఫ్తార్‌ విందు ప్రారంభానికంటే ముందుగానే గ్రామానికి చేరుకున్న రోజా అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు. అనంతరం ముస్లింలకు కానుకలు అందజేశారు. కాగా గతంలో ఎన్నికల సమయంలో మీరాసాహెబ్‌ పాళెంలో పర్యటించిన రోజా గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మాటిచ్చారు. అనంతరం అధికారికంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట మేరకు గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది.