మంత్రి రోజాకు అస్వస్థత..

volunteers-are-true-welfare-servants-says-minister-rk-roja

వైస్సార్సీపీ మంత్రి రోజా అస్వస్థత గురయ్యారు. కాలునొప్పి, వాపుతో బాధపడుతుండడం తో కుటుంబ సభ్యులు చెన్నైలోని థౌజండ్‌ లైట్స్‌లో ఉన్న అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగా ఉందని, వాపు కూడా తగ్గిందని డాక్టర్లు చెబుతున్నారు. త్వరలోనే రోజాను డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. రోజా అస్వస్థతకు గురైందనే వార్త తో వైస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. చివరికి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు ప్రకటించడంతో ఊపిరిపీల్చుకున్నారు. ‘గెట్ వెల్ సూన్ ‘ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న రోజా.. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడూ పర్యటిస్తూ బిజీ బిజీ గా ఉంటారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించడంతో పాటు టూరిజం అభివృద్ధిపై తన శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వివిధ రాష్ట్రాలు, దేశాల్లో కూడా రోజా పర్యటిస్తూ ఉంటారు. మరోవైపు జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష, విపక్ష పార్టీలు చేసే విమర్శలకు రోజా తరచూ గట్టి కౌంటర్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.